Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం వాయిదా* హైదరాబాద్ నివాస్ న్యూస్ ఫిబ్రవరి 4 హైదరాబాద్తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్కుమార్ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు మండలినీ వాయిదా వేయాలని ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని మంత్రి కొండా సురేఖ కోరారు. దీంతో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్కమిటీ సమర్పించనుంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను ఉపసంఘానికి సోమవారం అందించింది. ఈ రెండు నివేదికలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
Admin
Nivas News