Nivas News - తెలంగాణ / Nivas news : CBSE ఫలితాలలో ఏకశిలా విద్యాసంస్థల విజయకేతనం హనుమకొండ జిల్లా మే 13 నివాస్ న్యూస్ ప్రతినిధి:- ఈరోజు ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాలలో ఏకశిలా సీబీఎస్ఈ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మొన్న ఇంటర్, నిన్న ఎస్ ఎస్ సి, నేడు సీబీఎస్ఈ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మా ఏకశిలా విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేసాయి అని తెలిపారు. అత్యుత్తమ స్థాయి విద్యాబోధన, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, అంకితభావం గల ఉపాధ్యాయులు, విద్యా విధానానికి అనుకూలంగా వనరులను సమకూర్చడం మా ఏకశిలా విద్యాసంస్థల విజయ రహస్యాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యకు, జీవితంలో ఎదుగుదలకు అవసరమయ్యే నైపుణ్యాలను జోడించి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడాలన్నదే మా ఏకశిలా విద్యాసంస్థల సంకల్పం అన్నారు. మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థినీ విద్యార్థులను అభినందించి జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని కృషి, పట్టుదలతో తమ తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలని తెలిపారు. మా విద్యార్థులు సాధించిన అత్యుత్తమ మార్కులు ఏం సాయి హాసిని (487)- H.T No 28139504 ఎల్ సౌమిత (486)- H.T No 28139502 పి సాయి పౌర్ణిక్ (483) H.T No 28139557 ఈ కార్యక్రమంలో ఏకశిలా విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ బేతి కొండల్ రెడ్డి , గౌరు సువిజా తిరుపతిరెడ్డి, ముచ్చ జితేందర్ రెడ్డి, రిశ్విక్ రెడ్డి , ch దినేష్ రెడ్డి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Nivas News