Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *ఏడాదంతా బడికెళ్లి టెన్త్లో 600 మార్కులకు 1 మార్కు తెచ్చుకున్న విద్యార్ధి..షోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న మార్క్ మెమో* హైదరాబాద్ నివాస్ న్యూస్ మే 6 రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెల పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. 600 మార్కులకు 600 మార్కులు తెచ్చుకున్నారు. 600లకు ఒకేఒక్క మార్కు తక్కువ వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇక వీరందరి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లోని ఓ విద్యార్థికి మాత్రం 600 మార్కులకు గాను కేవలం ఒకే ఒక్క మార్కు వచ్చింది. అదేంటీ.. ? అని అనుకుంటున్నారా.. మీరు సరిగ్గానే విన్నారు. ఇంత అరవీర భయంకరంగా పరీక్షలు రాయడం టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలోనే రికార్డు సాధించినట్లైంది. సదరు విద్యార్ధి మార్కుల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏ జిల్లాలో జరిగిందో తెలియదు గానీ ఈ మార్కుల జాబితా మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే టెన్త్లో ఈ ఒక్క మార్కు తెచ్చుకున్న విద్యార్ధి ఏ కారణంగా.. పరిస్థితులు ఏమై ఉంటం వల్ల.. ఇలా పరీక్షలు రాయవల్సి వచ్చిందో మనం ఊహించలేం. ఏదీఏమైనా ఒక్క పరీక్షలు మాత్రమే మన జీవితంలోని గెలుపోటములను నిర్ణయించలేవన్నది అక్షర సత్యం. ఏపీలో మే 19 నుంచి 28, వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపులు మే 18వ తేదీ వరకు చెల్లించే అవకాశం ఉంది. అంటే పరీక్షకు ఒక్కరోజు ముందు వరకు ఫీజు కట్టొచ్చన్నమాట.
Admin
Nivas News