Nivas News - తెలంగాణ / Nivas news : *పది రోజుల క్రితం మరణించిన బాలిక పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్* రాజన్న సిరిసిల్ల జిల్లా నివాస్ న్యూస్ మే2 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు
Admin
Nivas News